కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో వర్షంతో దెబ్బతిన్న చోట్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి. అలాగే నష్టం అంచనాలు త్వరగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేయలన్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లకు వంతెనలకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని సూచించారు.
వాటికి కావాల్సిన బడ్జెట్ నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పంట నష్టానికి సంబంధించి నివేదికలు వెంటనే సమర్పించాలని తెలిపారు. గత మూడు రోజుల క్రితం కురిసిన ఈ పరిశీలన ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్ రావు, ఇరిగేషన్ ఈఈ గుణవంత రావు, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్స్ట్రోక్ చాంపియన్గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు