Telangana | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్నది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల ఎన్రోల్మెంట్ గణనీయంగా మెరుగవుతున్నది. ఇదే విషయాన్ని ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) సర్వే వెల్లడించింది. 2017-18 నుంచి 2021-22 మధ్య ఐదేండ్ల కాలంలో రాష్ట్రంలో మొత్తం నమోదు 6 శాతం పెరిగింది. ఇదివరకు 34 శాతం ఉండగా, ఐదేండ్లల్లో 40.0శాతానికి చేరగా, పురుషుల నమోదు నాలుగు శాతం పెరిగి 34.7శాతం నుంచి 38.5శాతానికి, మహిళల నమోదు ఏకంగా 7 శాతం పెరిగి 34.1 శాతం నుంచి 41.56 శాతానికి చేరింది.