నల్లగొండ : కేంద్రం తెచ్చిన కొత్త రైతు చట్టాలను వెంటనే రద్దుచేయాలని సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రల రైతులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే దేశంలో బ్యాంకింగ్, ఎల్ఐసీతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం సంస్కరణల పేరుతో విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రైతు వ్యతిరేక చట్టాలపై తాను నిర్మించిన రైతన్న సినిమాను ఆదరించాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, చందంపేట పీఏసీఎస్ చైర్మన్ జాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!