హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు కక్షిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఒకేరోజు 11,19,079 కేసులను పరిష్కరించారు. వీటిలో 85,231 ప్రీలిటిగేషన్ కేసులు, 10,31,317 క్రిమినల్ కేసులు, 2,531 సివిల్ కేసులున్నాయి. వివిధ కేసుల్లో లబ్ధిదారులకు రూ.397 కోట్లు పరిహారం చెల్లింపులపై ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 373 లోక్అదాలత్ బెంచ్లను ఏర్పాటుచేశారు.
హైకోర్టులో రెండు, రుణ రికవరీ ట్రిబ్యునల్ రెండు కలుపుకొని మొత్తం 341 బెంచ్లను అందుబాటులో ఉంచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పీ శ్యాంకోషి మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా లోక్అదాలత్ నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలో జస్టిస్ శ్యాంకోషి లోక్అదాలత్ను ప్రారంభించారు.