కొల్చారం, జనవరి 26: మెదక్ జిల్లా కొల్చారం మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొల్చారం రైతువేదిక వద్ద క్లస్టర్ ఏఈవో వినీతభవాని జాతీయ పతాకాని ఆవిష్కరిస్తుండగా మధ్యలోనే జెండా కింద పడిపోయింది. వెంటనే ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది అంజద్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి వినీతభవాని జెండాను సరిచేస్తుండగానే ఇతర శాఖల అధికారులు జెండావందనం సమర్పించగా, కేజీబీవీ విద్యార్థినులు జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఇదంతా జరుగుతుండగా తహసీల్దార్ మహ్మద్ గఫార్మియా, ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీపీ మంజుల, ఏవో శ్వేతకుమారి అక్కడే ఉన్నారు. కాగా మండలంలోని ఎనగండ్ల రైతు వేదిక వద్ద ఆవిష్కరించిన జాతీయ జెండా ప్రముఖుల మృతికి సంతాప సూచకంగా అవనతనం చేసినట్లుగా ఉంది.