హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): శాసనసభ ముందుకు ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లు రానున్నది. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్ధరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగడంతోపాటు ఆమోదం కూడా పొందాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం శాసనసభ ముందుకు ద్రవ్యవినిమయ బిల్లు రానున్నది.