పాలకుర్తి : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్త చిన్నాల రమేశ్ కొద్ది నెలల కిందట ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ సందర్భంగా ఆయన భార్య మౌనిక కు పార్టీ తరుఫున మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కు (Insurance check) ను తిరుమల గిరిలో బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. పార్టీకి వెన్నముక లాంటి కార్యకర్తలకు అండగా ఉంటున్నామని తెలిపారు. దురదృష్టవాశాత్తు కార్యకర్త మరణిస్తే వారి కుటుంబానికి బీఆర్ఎస్(BRS) ఆసరాగా ఉంటూ బీఆర్ఎస్ తరుఫున బీమాను అందిస్తుందని వెల్లడించారు. కార్యకర్తలు పార్టీ కి అండగా ఉండాలని సూచించారు. బీమా చెక్కును అందజేసిన పార్టీ అధినేతలు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు మృతుడి భార్య మౌనిక కృతజ్ఞతలు తెలిపింది.
సేవాలాల్ గుడి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి
పాలకుర్తి లో ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణ స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం పరిశీలించారు. అక్కడే ఉన్న సేవాలాల్ గుడి నిర్మాణ కమిటీ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు. శంకుస్థాపన రోజున నిర్వహించనున్న భారీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. వివిధ కమిటీలు వేసుకోవాలని, ఆయా కమిటీ లకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎకరా స్థలంలో నిర్మిస్తున్న సేవాలాల్ గుడి, ఫంక్షన్ హాల్, లంబాడా ల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటాయని చెప్పారు.