Weather update | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లటి వార్త అందించింది. రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అకడకడా కురుస్తాయని అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని పేర్కొన్నది. 3,4 రోజుల నుంచి ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. కొన్నిచోట్ల 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ దశలో ప్రజలకు తాజాగా వాన ముచ్చట ఉపశమనం కలిగించింది.
వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రం లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు న మోదవుతున్నాయి. ఈ నెల 29 వరకు ఎం డలు దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉదయం వేళలో 40 నుంచి 46 డిగ్రీల మధ్య, మధ్యాహ్నం 43 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని సూచనలు జారీ చేసింది. ప్రజలు ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వర కు బయట తిరగవద్దని ఆ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న సూ చించారు. రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడితే జూన్ మొదటి వారంలో కేరళలో వర్షాలు ప్రా రంభమవుతాయని తెలిపారు. ఎండల తీవ్రతతో రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో వడదెబ్బకు ఏడుగురు మృత్యువాత పడ్డారు.
రెండువారాలుగా అధిక వేడి, ఉక్కపోతతో తిరుమల కొండపై అల్లాడుతు న్న భక్తులకు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉపశమనం లభించింది. తిరుమల కొండపై భారీ వర్షం పడింది. అప్పటివరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భక్తులు సేదతీరారు. అరగంటపాటు పడిన వర్షంతో తిరుమల కొండలపై చల్లని గాలులు వీచాయి. రెండు వారాలుగా తిరుమల కొండపై 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత ఉండగా, అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు తగ్గాయని అధికారులు తెలిపారు.