హైదరాబాద్ : భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభాంతో రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్, భద్రాత్రి కొత్తగూడెం, నల్లగొండ, వికారాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, మల్కాజిగిరి, రంగారెడ్డి,వనపర్తి,గద్వాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే ఎల్లుండి నుంచి తెలంగాణలో ఎండల తీవ్ర మరింత పెరగనుంది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు బయటలకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఎండల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.