హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విధించిన గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వరకు గల సడలింపును తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మూల శ్రీధర్రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రధాన కార్యదర్శి మూల హరీశ్, జీఏడీ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కాను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో గ్రేడ్ -2 అనలిస్టు పోస్టుల భర్తీలో 34 ఏండ్ల వయోపరిమితిగా నిర్ణయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.