Singareni | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు పెరిగిన జీతభత్యాల మొత్తం బకాయిలు రూ.1726 కోట్లు ఒకే దఫాలో చెల్లించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. కోల్ వేజ్ ఒప్పందం ప్రకారం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన జీతభత్యాలకు.
సంబంధించిన బకాయిలు (1.7.2021 నుంచి 31.5.2023 వరకు) ఒకేదఫాలో ఈ నెల 21న చెల్లించాలని సర్క్యులర్ను జారీచేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో ఒక్కో కార్మికునికి సుమారు రూ.4 లక్షల మేరకు వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 41 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.