హుజూరాబాద్, మే 13 : కొనుగోలు చేసిన మక్కలను రెండు రోజుల్లో తరలించకపోతే మార్కెట్ యార్డులోనే రైతులతో కలిసి పడుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులను హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మారెట్లోని మార్ఫెడ్ మకల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో నేరుగా మాట్లాడారు. మారెట్ యార్డులో వేలాది మకల బస్తాలు పేరుకుపోవడం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మారెట్లో సుమారు 40 వేల బస్తాలు పేరుకుపోయి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరిక చేశారు. మకలను తరలించేందుకు రైతుల వద్ద కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హమాలీల కొరతతో లోడింగ్, అన్ లోడింగ్ పనులు పూర్తిగా దెబ్బతిన్నాయని మారెట్ సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే సమస్య పరిషారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.