స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ : కరీంనగర్ శివారులోని దిగువ మానేరు జలాశయం బీఆర్ఎస్ పాలనలో ఏ సీజన్లో చూసినా నిండా నీటితో కళకళలాడుతూ ఉండేది. ఎస్సారెస్పీ దిగువ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న ఈ జలాశయం 24 టీఎంసీల సామర్థ్యం కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎండాకాలంలోనూ 10 టీఎంసీలకు తగ్గకుండా ఉండేది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జలాశయంలో 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం నీళ్లు లేక అడుగంటి ఖాళీగా కనిపిస్తోంది. మరో రెండు నెలలు ఎండలు ముదిరితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికీ ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వస్తున్నాయి.