Jagtial | జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి పక్కన మద్యం వాహనం బుధవారం బోల్తా పడింది. కరీంనగర్ మద్యం డిపో నుంచి రూ.50 లక్షల విలువైన మద్యంతో ఏపీ15 పీసీ7575 నంబర్ గల వాహనం కోరుట్ల వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో రాజారాం వద్ద వీఆర్కే కాలేజ్ సమీపంలోకి చేరుకోగానే వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్కు ప్రమాదం తప్పింది. 50 శాతం మేర మద్యం బాటిళ్లు ధ్వంసమయ్యాయని, కేసు దర్యాప్తులో ఉందని ఎస్సై కుమారస్వామి తెలిపారు.