హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లును సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు 7 రోజులు, మండలి సమావేశాలు 5 రోజులు జరిగాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిలు సభలను నిరవధిక వాయిదా వేశారు.