హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ పెట్టిన ఇండెంట్పై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు తెలంగాణ సాగునీటిపారుదలశాఖకు కేఆర్ఎంబీ లేఖ రాసింది.
సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంట్పై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీకి ఇప్పటికే కేంద్ర జలశక్తిశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి తెలంగాణ సర్కారు తరఫున ఎవరూ హాజరు కాలేదు. దీంతో తెలంగాణ అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆ అంశంలో నిర్ణయం తీసుకుంటామని ఏపీకి కేఆర్ఎంబీ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుకు కేఆర్ఎంబీకి తాజాగా లేఖను రాసింది.