ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 7: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి పోటెత్తింది. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిర్చి బస్తాలు వచ్చినట్లయింది. దీంతో యార్డు అంతా ఎర్రబంగారం బస్తాలతో నిండిపోయింది.
గరిష్ఠ ధర క్వింటాకు రూ.22,300, మధ్య ధర రూ.20 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.12 వేలు, మధ్య ధర రూ.11 వేలు, కనిష్ఠ ధర రూ.9 వేల చొప్పున పలికాయి.