హైదరాబాద్, మార్చి27 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 11లో పొందుపరచని పలు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన రివర్ బోర్డుల గెజిట్ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.
ఏపీకి చెందిన హం ద్రీనీవా, తెలుగుగంగ హెడ్వర్క్స్, గాలేరు నగరి సుజల స్రవంతి హెడ్వర్క్స్తోపాటు దాని చుట్టూ ఉన్న నిర్మాణాలు, వెలిగొండ ప్రాజెక్టు, తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నె ట్టెంపాడు ప్రాజెక్టులకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా కేంద్రం రక్షణ కల్పించింది.