లక్షా 80 వేలు పెట్టి సాగు చేసిన పంట.. సాగునీరందక కండ్ల ముందే ఎండిపోయింది. దీంతో రూ.18 వేలకే గొర్రెల మేత కోసం ఇలా వదిలేశాడు రైతు సంగెం బాలయ్య. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లోని దృశ్యమిది.
కరెంటు కోతలు, సాగునీటి వెతల నేపథ్యంలో పంటలు కాపాడు కునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లోడ్ పెరిగి వ్యవసాయ బోర్లు కాలి పోతున్నాయి. మహబూబ్నగర్లో శుక్రవారం రిపేరు కోసం రైతులు తీసుకువచ్చిన మోటర్లివి.