హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలోని సమస్యలను గుర్తించి, పునరుద్ధరణ చర్యలను సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ మరోసారి రాష్ర్టానికి వచ్చింది. చంద్రశేఖర్ అయ్య ర్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన ఈ కమిటీ బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో మరోసారి సమావేశమైంది. మధ్యా హ్నం 3 గంటలకు జలసౌధకు చేరుకుని, ఇరిగేషన్ ఈఎన్సీ, ప్రాజెక్టు ప్లానింగ్, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ అధికారులతోపాటు, 3 బరాజ్లకు సంబంధించిన అధికారులు, డీపీఆర్లు తయారు చేసిన అధికారులు, సీడీవో అధికారులతో సాయంత్రం 7.30 గంటల వరకు సమావేశమైంది. ఈ భేటీలో వారి నుంచి పలు వివరాలను సేకరించడంతోపాటు పూర్వ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లను కూడా విచారించింది.