ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఈనెల 12 నుంచి కొనసాగుతున్నాయి. శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆలయంలో పూజలు చేసి మాట్లాడారు. ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధి కోసం రూ.10.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎంపీ నగేశ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాన్ని నిర్వహించనున్నారు. – ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ