జనగామ : భార్య మరణం జీర్ణించుకోలేక ఓ భర్త, భార్య సమాధి పక్కన ఆత్మహత్య( Suicide )చేసుకున్న ఘటన జనగామలో చోటు చేసుకుంది. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్లో తాటి రాజు (40) అనే రైల్వే ఉద్యోగి (Railway employee) భార్య ఆరు నెలల క్రితం చనిపోయింది. అనంతరం ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్య మరణాన్ని మరచిపోలేక తీవ్రంగా మనస్థాపానికి గురై రాజు ఆమె సమాధి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు.దీంతో తీవ్ర అస్వస్థకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయ్యాడు.మంగళవారం సమీప ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు (Police)ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.