Group-1 Prelims | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగా ణ): టీఎస్పీఎస్సీ జూన్ 11న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వే సేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షను కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఏ వెం కటేశ్ సహా వివిధ జిల్లాలకు చెందిన 36 మం ది దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించిం ది. ఈ మేరకు గురువారం హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ ఫుల్లా కార్తీక్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిట్ తదితరులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది.
విచారణను జూన్ ఆరో తేదీకి వాయి దా వేశారు. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షల మధ్య కనీస వ్యవ ధి రెండు నెలలు ఉండాలన్న నిబంధనను పాటించలేదని, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదాకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యా యవాది వాదించారు. దీనిని టీఎస్పీఎస్సీ తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాది ఎం రాంగోపాలరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రిలిమ్స్ పరీక్షల తేదీని టీఎస్పీఎస్సీ మార్చి 17న ప్రకటించిందని, సుమారు 85 రోజులు గడువు ఉన్నదని, పిటిషనర్లు చెప్తున్న రెండు నెలల కంటే ఎకువ గడువు ఉన్నదని చెప్పారు. గ్రూపు-4 జూలైలో నిర్వహిస్తున్నామని, దీనిని కూడా అభ్యర్థులకు తగిన గడువు ఉన్నదని తెలిపారు.
గ్రూప్-1 పరీక్షలకు 3.50 లక్షల మంది దరఖాస్తు చేశారని, 2.80 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాదులు వివరించారు. గ్రూపు-4కు 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, తొమ్మిదిన్నర లక్షల మందికిలేని అభ్యంతరం కేవలం 36 మందికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను కొట్టేయాలని, ఇదేం ప్రజోపయోగ వ్యాజ్యం కాదని చెప్పారు. పలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరిస్తూ ఇలాంటి రిట్లను కొట్టేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.