హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ను మంగళవారం హైకోర్టు మరోసారి కొట్టివేసింది. ఎమ్మెల్యేగా కిశోర్ ఎన్నిక చెల్లదని 2018లో ఆయనపై పోటీచేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ దాఖలు చేశారు.
దీన్ని కొట్టేయాలని కోరుతూ కిశోర్ గతంలో వేసిన అఫిడవిట్ను అప్పట్లోనే డిస్మిస్ చేసినందున రెండోసారి పిటిషన్ వేసేందుకు ఆయన అర్హులు కాదని జస్టిస్ ఎం లక్ష్మణ్ స్పష్టం చేశారు. తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వీడియో పుటేజ్, రికార్డులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.