హైదరాబాద్, 28 (నమస్తే తెలంగాణ): విద్యా సంస్థల నుంచి విశ్వవిద్యాలయాలు/బోర్డులు వసూలు చేసే అనుబంధ గుర్తింపు, తనిఖీ ఫీజులపై జీఎస్టీ విధించడం సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది.
విద్యా సంస్థల అనుబంధ గుర్తింపునకు ముందు విశ్వవిద్యాలయం/బోర్డు తనిఖీలు నిర్వహించడం సేవ కిందకే వస్తుందని, దీనికి విద్యాసేవల కింద వచ్చే మినహాయింపు కోరడం చెల్లదని తేల్చిచెప్పింది.