హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ, రాష్ట్ర నాయకులు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది. సీజే జస్టిస్ అలోక్ అరా ధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ధర్మాసనం వ్యాజ్యాన్ని విచారించింది. ఈసీ తరఫు న్యాయవాది దేశాయ్ అవినాశ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది మయూర్రెడ్డి వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాస్తవాలను నిర్ధారించుకోకుండా జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను నియంత్రించేందుకు ఈసీ ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారంటూ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ, రాహుల్గాంధీ, కేకే మహేందర్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డితోపాటు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా కేటీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారని న్యాయవాది మయూర్రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ ఫిర్యాదు పరిశీలనలో ఉన్నదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసీ న్యాయవాది చెప్పడంతో విచారణను ముగిస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.