హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ క్వార్టర్లను పొందే హక్కు అధికారులకే తప్ప వారి భార్యలకు, పిల్లలకు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. విభేదాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్న తనకు క్వార్టర్ కేటాయింపును కొనసాగించాలన్న ఆర్మీ అధికారి సమీర్శర్మ భార్య ఈషా శర్మ విన్నపాన్ని తోసిపుచ్చింది.
ఈ నెల 31లోగా క్వార్టర్ ఖాళీ చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. జనవరి 15లోగా క్వార్టర్ ఖాళీ చేస్తామంటూ పిటిషనర్ రాతపూర్వక హామీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆ క్వార్టర్ నుంచి ఆమెను ఖాళీ చేయించేలా ఆర్మీ అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.