హైదరాబాద్ : మాజీ మంత్రి(Former Minister) వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో చుక్కెదురయ్యింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వేసిన మధ్యంతర పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అవినాష్రెడ్డి(Avinash reddy) తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని, సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని అనుమతించింది.
అయితే విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని హైకోర్టు సీబీఐకి సూచించింది. అవినాష్రెడ్డి విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని తేల్చి చెప్పింది. అయితే అవినాష్రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సూచించింది .
తనపై సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్రెడ్డి వారంరోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేశారు. తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియోల(Audio and Video) ద్వారా రికార్డు చేయకపోవడంపై కోర్టులో ఆయన సవాలు చేశారు. విచారణ సందర్భంగా తన న్యాయవాదిని కూడా అనుమతించాలని పిటిషన్లో కోరారు.