హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సర్వే నంబర్ 403లో 4.18 ఎకరాల భూమిని 2021లో రెడ్ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
భూమి కేటాయింపును సవాల్ చేస్తూ రాష్ట్రీయ వానరసేన అనే ధార్మిక సంస్థ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్అరధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. నాలుగు వారాల గడువు కావాలని రెడ్ఫోర్ట్ సంస్థ కోరగా హైకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది. విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. ఈలోగా ఏమైనా నిర్మాణాలు చేపడితే అవి తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.