హైదరాబాద్: కర్ణాటకలో (Karnataka) కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను విధిస్తున్నదని విమర్శించారు. ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను (Political Election Tax) విధించడం ప్రారంభించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కామ్ల వారసత్వంతో స్కాంగ్రెస్గా (Scamgress) మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్కాంగ్రెస్ను తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.
Apparently Karnataka’s newly elected Congress Government has started levying a “political election tax” of ₹500 per Square Foot to Bengaluru builders to fund Telangana Congress 😁
Old habits die hard. The Grand old party and its rich legacy of Scams is legendary and that’s why…
— KTR (@KTRBRS) September 30, 2023