హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు వివిధ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్న విద్యుత్తు సబ్సిడీ కింద అక్టోబర్ నెల బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, హెచ్ఎండబ్ల్యూస్, ఎస్బీ, మిషన్ భగీరథ పథకాలకు అందించే సబ్సిడీ కింద రూ.958.33 కోట్ల బడ్జెట్ను ట్రాన్స్కోకు విడుదల చేస్తూ విద్యుత్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పూల్ అకౌంట్లో జమ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది.