హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం టీఎస్బీపాస్ ద్వారా చేసుకున్న దరఖాస్తులపై విచారణ నివేదికలివ్వడంలో జాప్యం చేస్తున్న మరో 13 మంది అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వారి వేతనంలో రూ.1,000 నుంచి 3 వేల వరకు కోత విధించింది. వేతన కోతకు గురైనవారిలో ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు, 11 మంది స్క్రూటినీ ఆఫీసర్లు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 103 మంది అధికారుల వేతనాల్లో కోత విధించినట్టయింది.