హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్ల లో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీ ల విడుదలకు రంగం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు గవర్నర్ తమిళిసై సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. వారిలో 212 మంది జీవితకాల శిక్ష అనుభవిస్తున్న వారు, మరో 19 మంది ఇతర శిక్షను అనుభవిస్తున్నారు.
ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, గాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ విశిష్ట అధికారాల(ఆర్టికల్ 161) మేరకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. తెలంగాణ ఏర్పడిన తర్వా త 2016, 2020లో మాత్రమే ఖైదీలను విడుదల చేశారు. మూడేండ్ల తర్వా త మళ్లీ గవర్నర్ సిఫారసు చేశారు.