హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు తమ వెంట ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు కూడా క్లాసులోకి మొబైల్ ఫోన్లు తీసుకవెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. తరగతి గదిలోకి వెళ్లే ముందే ఉపాధ్యాయులు తమ ఫోన్లను హెడ్ మాస్టర్కు అప్పగించి వెళ్లాలని స్పష్టం చేసింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.