హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్లకు అందజేసే డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభు త్వం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు సోమవారం మెమో జారీచేశారు. 2.73% ఒక డీఏను మంజూరుచేస్తూ ఇటీవలే జీవోను జారీచేసింది.
2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను చెల్లించనున్నట్టు మోమోలో తెలిపింది. జూలై నెల నుంచి ఈ వాయిదాలను వేతనాల్లో కలిపి ఖాతాల్లో జమచేస్తారు. పీఆర్సీ బకాయిల సర్దుబాటు ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనున్నది.