జనగామ/హైదరాబాద్ సిటీబ్యూ రో, మే 20 (నమస్తే తెలంగాణ): వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హెచ్ఎండీఏలోని ఐటీ సెల్లో కాంట్రాక్ట్ బేసిస్లో సపోర్ట్ అసోసియేట్గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేర కు శనివారం హెచ్ఎండీఏ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ తరఫున తన నియోజకవర్గం నుంచి రూ.20 లక్షలు సేకరించి ఇటీవల ఆ కుటుంబానికి అందజేశా రు. అదే సమయంలో ప్రీతి కుటుంబం తమలో ఒకరికి ఉద్యోగం కావాలని పట్టుబట్టింది. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ తాను నిర్వహిస్తున్న పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో ఐటీ సెల్లో ఉద్యోగం ఇప్పించారు.