హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి జొన్న కొనుగోలులో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
మొదట ఎకరానికి 5.1 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగా, దీన్ని 8 క్వింటాళ్లకు పెంచింది. దీంతో రైతుకు ఇబ్బందులు తప్పనున్నాయి.