హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే బుధ, గురువారాలు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, శుక్రవారం సైతం సెలవును కొనసాగిస్తున్నట్టు విద్యాశాఖ పేర్కొన్నది.
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో శుక్రవా రం నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులను శుక్రవారం వరకు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.