హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్పై అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాంగ్రెస్ అనుబంధ కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్ సునీ ల్, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూదన్ ఈ కమిటీలో ఉన్నారు. దీనికి సీసీఎల్ఏ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. పోర్టల్కు సంబంధించిన సమస్యల అధ్యయనం, పరిష్కారం కోసం కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు, కలెక్టర్లు ఈ కమిటీకి సహకరించాలని సూచించారు.