హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు కృషి చేయాలని, ఆ మేరకే ఎన్నికల్లో పొ త్తులు పెట్టుకోవాలని సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయమైన ఎంబీభవన్లో సోమవారం జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల సం యుక్త సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొత్తుల విషయంలో ఐక్యంగా వ్యవహరించాలని, ఏ ప్రిల్ 9న హైదరాబాద్లో నాయకులతో సం యుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, నేతలు చాడ వెంకటరె డ్డి, పల్లా వెంకటరెడ్డి, చెరుపల్లి పాల్గొన్నారు.