హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయిల్పామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని, అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి తుమ్మల చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.97 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులో ఉన్నదని వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 52 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగైందని, వచ్చే ఏడాది లక్ష ఎకరాల్లో సాగు లక్ష్యం పెట్టుకోవాలని ఆదేశించారు. సంబంధిత కంపెనీలు ఫ్యాక్టరీల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించా రు. వ్యవసాయాభివృద్ధి ప్ర ణాళికలపైనా చర్చించారు.
వానకాలం విత్తనాలు సిద్ధం చేయాలి
వచ్చే వానకాలం కోసం విత్తనాలను సిద్ధం చే యాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. బుధవారం డైరెక్టరేట్లో విత్తనాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. నాణ్యతలేని విత్తన విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.