హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా మారిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి అల్లోల హాజరయ్యారు. ఈ సందర్భంగా హరితహారంపై రూపొందించిన లఘుచిత్రం, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. హరితహారం ద్వారా సాధించిన ఫలితాలు, ప్రగతి నివేదికను ఆవిషరించారు.
అడవుల పరిరక్షణకు విశేష కృషిచేసిన అటవీ అధికారులు, సిబ్బంది, పలు గ్రామ పంచాయతీల సర్పంచులు, గ్రామ కార్యదర్శులను సతరించి, అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని చెప్పారు. తొమ్మిదేండ్లలోనే హరితహారం కింద రాష్ట్రవ్యాప్తంగా 273.33 కోట్ల మొకలు నాటామని, నిర్వహణ కోసం ఇప్పటిదాకా రూ. 10,822 కోట్లు ఖర్చుచేశామని వెల్లడించా రు. హరితహారంతో మన రాష్ట్ర అడవులకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు.
తెలంగాణవ్యాప్తంగా పచ్చదనం పరిఢవిల్లుతున్నదని పేర్కొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ (సామాజిక అడవులు) లోకేశ్ జైస్వాల్, అట వీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, అటవీశాఖ, పంచాయతీరాజ్, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.