హనుమకొండ : టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటుపై వర్ధన్నపేట మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీ లోగా గ్రామ, వార్డు, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. కమిటీల ఏర్పాటుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ప్రతి గ్రామానికి వెళ్లి స్థానిక నాయకుల సమన్వయంతో కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసి మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ, ఆత్మ కమిటీ చైర్మన్ గుజ్జ గోపాల్ రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల : జిల్లా కేంద్రానికి ఇటీవల సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ, దవాఖానను కేటాయించారు. ఈ మేరకు సోమవవారం సీఎం ఓఎస్డీ పబ్లిక్ హెల్త్ గంగాధ ర్,టీఎస్ ఎంఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డితో కలిసి ధరూర్ క్యాంపులో మెడికల్ కాలేజీకి కేటాయించిన 27 ఎకరాల స్థలాన్ని,మాతా శిశు కేంద్రాన్ని పరిశీలించారు.
కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో వైద్య కళాశాల స్థలం విషయంపై కలెక్టర్తో చర్చించారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా లైబ్రరీ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, జిల్లా దవాఖాన సుపరింటెండెంట్ సుదక్షణ దేవి, ఆఎంవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం