కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని కాగజ్నగర్ మండలం దారిగాం( Dharigam) అటవీ ప్రాంతంలో రెండు పులుల మధ్యలో జరిగిన ఘర్షణలో ఒక పులి(Tiger) మృతి చెందిన ఘటన పై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. ఆదివారం ఘటనా స్థలిని పరిశీలించిన అటవీశాఖ ఉన్నతాధికారులు పంచనామా నిర్వహించారు. నమూనాలను సేకరించి ప్రయోగశాలకి పంపించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీసీఎఫ్ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టెబ్రీవాల్ మీడియాకు వెల్లడించారు.
రెండు సంవత్సరాల వయసు గల రెండు అడ పులులు ఆవాసం కోసం పడిన ఘర్షణలో ఒక ఆడ పులి తీవ్ర గాయలపాలై మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణ వచ్చామని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 5, 6 రోజులు అవుతున్నట్లుగా తెలిపారు. పశు వైద్యాధికారులు సమక్షంలో పులి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి ఎన్టీసీఏ నిబంధనల ప్రకారం ఖననం చేసినట్లు వివరాలను వెల్లడించారు.