సిద్దిపేట : సిద్దిపేట జిల్లాను (Siddipet) మంగళవారం పొగమంచు(Fog) కమ్మెసింది. ఎక్కడ చూసిన పొగమంచే ఉండడంతో రోడ్లు సైతం కనిపించలేదు. ఉదయం 8గంటల వరకు కూడా భానుడు కనిపించలేదు. పొగమంచులో వాహనదారులు సైతం రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడ్డారు. వాహనాలకు లైట్లు వేసుకుని తమ రాకపోకలు సాగించారు. మరికొందరు మాత్రం తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుకొని మంచి తగ్గిన తర్వాత వెళ్తున్నారు. చల్లిగాలుల(Cold winds)తో ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. చల్లటి గాలులను తట్టుకునేందుకు చలిమంటలను వేసుకుంటున్నారు.