నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద మొదలైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు 27,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీనికి తోడుగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ముప్కాల్ పంప్ హౌస్ నుంచి కాలేశ్వరం జలాలను 3000 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 27.550 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. గత ఏడాది ఇదే సమయానికి 76 టీఎంసీలు నీళ్లు ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ వెల్లడించింది.