సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): రెమిడెసివిర్ ఇంజక్షన్ను బ్లాక్లో విక్రయిస్తున్న వారిపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. శనివారం ఒక్కరోజే నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం నాలుగు చోట్ల దాడులు నిర్వహించి.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 32 రెమిడెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ దుకాణాలు, మెడికల్ విభాగంలో పనిచేసే కొందరు రూ.3500 విలువ ఉన్న ఒక్కో ఇంజక్షన్ను బ్లాక్లో రూ. 35 వేల వరకు విక్రయిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలో దాడులు చేసి..ఏడుగురురిని అదుపులో తీసుకున్నారు.