సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని అగ్నిగుండాలు దాటిన అనంతరం భక్తులు అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండాల కార్యక్రమానికి 20 వేలకు పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ ఈవో బాలాజీ వెల్లడించారు కాగా, అగ్నిగుండాల కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయని ఆయన తెలిపారు.