హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర ప్రాజెక్ట్ ఎగువన మరొక బ్యాలెన్సింగ్ జలాశయ నిర్మాణానికి సహకరించాలని కర్ణాటక శాసనసభ అంచనాల కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కాళేశ్వరం ప్రా జెక్టు సందర్శనకు వచ్చిన ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల బృందం మంగళవారం నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశ మైం ది.
పూడికతో తుంగభద్ర ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 32 టీఎంసీలకు తగ్గిందని వారు వెల్లడించారు. అందువల్ల నదిపై ఎగువన మరొక జలాశయాన్ని నిర్మించాలనే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. తుంగభద్ర ఉమ్మడి ప్రాజెక్ట్ కావడంతో తెలంగాణ కూడా సమ్మతించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉ న్నదని నీటి పారుదల అధికారులు, ఇం జినీర్లు ఎమ్మెల్యేలకు వివరించారు.