Vote | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు. వీరంతా ఓటు వేసే తేదీని ముందుగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నిర్ణయిస్తారు.
ఎలాంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మంది, బాల్కొండ 707, సత్తుపల్లి 706, పెద్దపల్లి 640, బహుదూర్పురా 11 మంది, అలంపూర్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 12 మంది చొప్పున ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించింది.